
సాధారణంగా మనం గుడికి వెళ్లినప్పుడు చెప్పులు బయట వదిలి వెళ్తాం. అయితే ఎక్కువగా రద్దీ ఉన్నప్పుడు లేదా చెప్పులు ఒకేలా ఉన్నప్పుడు తొందరల్లో వేరే వాళ్లు మన చెప్పులు వేసుకొని వెళ్లే ప్రమాదం ఉంటుంది. లేదా ఎవరైనా తీసుకెల్లొచ్చు. ఇలా గుడికి వెళ్లినప్పుడు మనం చెప్పులను కోల్పోవడం జరుగుతుంది.

అయితే జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం, జాతకంలో శని దోషం ఉన్నవారు.. ఆలయంలో తమ చెప్పులను పోగొట్టుకోవడం వల్ల వారిపై శని ప్రభావం తగ్గడానికి ఇది సంకేతం అని జోతిష్యులు చెబుతున్నారు. అంతేకాదు ఇది పాపాల భారం తగ్గడానికి, జీవితంలో అప్పులు లేదా అడ్డంకులు తొలగిపోవడానికి, శుభ పరిణామాల ప్రారంభానికి సంకేతమని అంటున్నారు.

ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు మీ పాదరక్షలను బయటే వదిలి వెళ్లడం కేవలం ఒక సాధారణ ఆచారం మాత్రమే కాదు. ఇది మంచి అనుభూతిని కూడా సూచిస్తుందట. మనం గుడి బయట చెప్పులు వదిలివేయడం అంటే.. మనో ఉన్న గర్వం, అహంకారం, ద్వేషం వంటి ప్రతికూల భావోద్వేగాలను బయటే వదిలి..స్వచ్ఛమైన మనస్సు, భక్తతో దేవుని ముందుకు వెళ్లడం అని అర్థమట.

ఇలా పాదరక్షలను బయటే వది వెల్లడం అనేది మనకు రామాయనంలోని ఓ సంఘటనను గుర్తు చేస్తుంది. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు, భరతుడు తన పాదుకలను సింహాసనంపై ఉంచి, వాటిని పూజించి, రాముడి పేరు మీద రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ సంఘటన పాదుకలు ఒక వ్యక్తి శక్తి, అధికారం, బాధ్యతలను ఎలా సూచిస్తాయో తెలియజేస్తుంది. చెప్పులు కేవలం పాదరక్షకులు మాత్రమే కాదు క్రమశిక్షణ, సంస్కృతి, స్థిరత్వానికి చిహ్నం. అందువల్ల, పాదాన్ని పూర్తిగా కప్పి ఉంచే పాదరక్షలను ధరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

అంతే కాదు శని ప్రభావంతో ఉన్న వ్యక్తులు సోమవారం, బుధవారం లేదా శనివారం ఒక జత పాదరక్షలను దానం చేస్తే, అది మంచి ఫలితాలను ఇస్తుందని చాలా మంది నమ్ముతారు. సన్యాసులు ధరించే చెక్క పాదరక్షలు ఆధ్యాత్మిక స్వచ్ఛత, సరళమైన జీవనం, త్యాగం యొక్క భావనను సూచిస్తాయి. అందువల్ల, పాదరక్షలకు మన సంస్కృతిలో దాని భౌతిక అవసరానికి మించి ఆధ్యాత్మిక అర్థం ఉందని చెప్పవచ్చు.( Note: పైన పేర్కొన్న అంశాలు నివేదికలు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం మేరకు అందించబడినవి.. వీటినీ టీవీ9 దృవీకరించట్లేదు)