
చాలామంది తగినంత నిద్రపోయినప్పటికీ కళ్ల కింద నల్లటి వలయాలు అలాగే ఉంటున్నాయని ఆందోళన చెందుతుంటారు. దీనికి అనేక ఇతర కారణాలు ఉంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ సమస్యను నివారించడానికి సన్స్క్రీన్ వాడకం, విటమిన్ సి ఉన్న క్రీములు, కంటి కింద తేమను అందించే క్రీములు ఉపయోగించాలని సూచిస్తున్నారు. వీటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నీరు తాగడం కూడా అత్యంత అవసరం. పూర్తి వివరాల్లోకి వెళితే..
కొన్నిసార్లు ఈ సమస్య కుటుంబ సభ్యుల నుండి వస్తుంది. మీ తల్లిదండ్రులు లేదా బంధువులకు ఈ సమస్య ఉంటే, మీకు కూడా వచ్చే అవకాశం ఎక్కువ. వయస్సు పెరిగేకొద్దీ కళ్ల చుట్టూ ఉన్న చర్మం పల్చగా మారుతుంది. దీనివల్ల చర్మం కింద ఉన్న రక్తనాళాలు స్పష్టంగా కనిపిస్తూ నల్లగా అనిపిస్తాయి. దుమ్ము, ధూళి వల్ల వచ్చే అలర్జీల కారణంగా కళ్లు దురదగా అనిపిస్తాయి. అప్పుడు కళ్లను ఎక్కువగా రుద్దడం వల్ల ఆ ప్రాంతంలో చర్మం వాపుకు గురై నల్లగా మారుతుంది.
ముఖ్యంగా ఐరన్, విటమిన్ బి12, విటమిన్ కె లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. ఇది చర్మం పాలిపోయినట్లు చేసి, కళ్ల కింద వలయాలను స్పష్టంగా చూపిస్తుంది. శరీరంలో తగినంత నీరు లేకపోతే, చర్మం పొడిబారి పీల్చుకుపోయినట్లు అవుతుంది. ఇది కూడా నల్లటి వలయాలకు కారణమవుతుంది.
ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు…
సన్స్క్రీన్ వాడకం: సూర్యరశ్మిలోని యూవీ కిరణాలు కళ్ల చుట్టూ చర్మాన్ని మరింత నల్లగా మారుస్తాయి. కాబట్టి బయటకెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్స్క్రీన్ లోషన్ రాయాలి.
విటమిన్ సి, కె క్రీములు: విటమిన్ సి, విటమిన్ కె ఉన్న ఐ క్రీములను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల కంటి చుట్టూ రక్త ప్రసరణ మెరుగుపడి, వలయాలు తగ్గుతాయి.
తేమను అందించడం: కళ్ల చుట్టూ చర్మం పొడిబారకుండా ఉండటానికి మంచి మాయిశ్చరైజర్ లేదా ఐ క్రీమ్ను నిరంతరం ఉపయోగించాలి.
ఆరోగ్యకరమైన ఆహారం: ఐరన్, విటమిన్లు సమృద్ధిగా ఉన్న పౌష్టికాహారాన్ని తీసుకోవడం, రోజూ 3-4 లీటర్ల నీరు తాగడం అత్యంత ముఖ్యం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..