
సనాతన ధర్మం ప్రకారం జీవనశైలి అనేది కేవలం అలవాటు మాత్రమే కాదు, అది ఒక సంస్కారం. మన గ్రంథాలు దినచర్యలో ప్రతి పనికీ ఒక ప్రాముఖ్యతను, సమయాన్ని కేటాయించాయి. ముఖ్యంగా ‘స్నానం’ అనేది కేవలం శరీరాన్ని శుభ్రం చేసుకోవడం మాత్రమే కాదు, అది మనస్సును, ఆత్మను పవిత్రం చేసే ప్రక్రియ. శాస్త్రాల ప్రకారం స్నాన సమయాన్ని బట్టి ఆ వ్యక్తి పొందే ఫలితాలు మారుతుంటాయి.
మన శాస్త్రాలు స్నానాలను ప్రధానంగా నాలుగు రకాలుగా విభజించాయి:
తప్పక పాటించాల్సిన నియమాలు
కేవలం సమయం మాత్రమే కాదు, స్నానం చేసే పద్ధతిపై కూడా కొన్ని కఠినమైన నియమాలు ఉన్నాయి. నగ్న స్నానం ఎప్పుడు చేయకూడదు. జల దేవతను గౌరవిస్తూ, ఎప్పుడూ పూర్తిగా వివస్త్రలుగా స్నానం చేయకూడదని శాస్త్రం చెబుతోంది. అలాగే, ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేయడం వల్ల జీర్ణక్రియ మందగించి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీనిని కూడా ‘రాక్షస స్నానం’గానే పరిగణిస్తారు. ఇక, ఇతరులు స్నానం చేసి వదిలేసిన నీటితో స్నానం చేయకూడదు. అలాగే స్నానం చేసే నీటిలో మలమూత్ర విసర్జన చేయడం మహా పాపంగా భావిస్తారు. పవిత్ర నదుల్లో స్నానం చేసినప్పుడు, అక్కడే బట్టలు ఉతకడం వంటి పనులు చేసి నీటిని కలుషితం చేయకూడదు.
నేటి ఆధునిక కాలంలో పని ఒత్తిడి వల్ల సమయపాలన కష్టమైనప్పటికీ, కనీసం రాక్షస స్నానాన్ని వదిలి ‘మానవ స్నానం’ వరకైనా పాటించడం వల్ల జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. సూర్యోదయానికి ముందే స్నానాది కార్యక్రమాలు ముగించుకోవడం వల్ల అటు ఆరోగ్యం, ఇటు దైవానుగ్రహం రెండూ లభిస్తాయి.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..