బ్రేక్‌ఫాస్ట్‌తో గుండె జబ్బులకు చెక్..!

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో తినడానికే సమయం దొరకనంత బిజీగా ఉంటున్నారు ప్రజలు. కానీ.. నిజానికి ఉదయం సమయం వ్యచ్ఛించి మరీ బ్రేక్ ఫాస్ట్ తినాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ తినకపోతే బరువు అధికంగా పెరిగే ప్రమాదముందని అమెరికాలోని మయో క్లినిక్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొన్ని రోజులు తిని, మానేసి, ఆ తర్వాత మళ్లీ తినడం చేస్తే ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. తాజాగా.. ఈ బ్రేక్ ఫాస్ట్‌పై […]

బ్రేక్‌ఫాస్ట్‌తో గుండె జబ్బులకు చెక్..!
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:55 PM

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో తినడానికే సమయం దొరకనంత బిజీగా ఉంటున్నారు ప్రజలు. కానీ.. నిజానికి ఉదయం సమయం వ్యచ్ఛించి మరీ బ్రేక్ ఫాస్ట్ తినాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ తినకపోతే బరువు అధికంగా పెరిగే ప్రమాదముందని అమెరికాలోని మయో క్లినిక్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొన్ని రోజులు తిని, మానేసి, ఆ తర్వాత మళ్లీ తినడం చేస్తే ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

తాజాగా.. ఈ బ్రేక్ ఫాస్ట్‌పై గ్రీకులోని ఏథెన్సులోని కాపోడిస్త్రీ విశ్వవిద్యాలయం వారు పరిశోధనలు చేయగా పలు ఆసక్తికర విషయాలు తెలిసాయని వెల్లడించారు. మంచి ప్రోటీన్ ఉన్న బ్రేక్ ఫాస్ట్ తినేవారిలో గుండె ఆరోగ్యకరంగా పనిచేస్తుందని వెల్లడించారు. ఉదయం కనీసం 400 కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా గుండెలోని ధమనులు సరైన విధంగా పనిచేస్తాయని.. దీని వలన గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువని గ్రీకు పరిశోధకులు సూచించారు.

అల్పాహారంలో ఏ ఆహారానైనా తీసుకుంటాము. కానీ.. ఉత్తమంగా జున్ను, పాలు, తృణధాన్యాలు (మొలకెత్తిన విత్తనాలు), నట్స్‌ను తీసుకోవడం ద్వారా మేలైన ఫలితాలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. 63 ఏళ్ల వయస్సున్న 2 వేల మందిపై ఈ కాపోడిస్త్రీ యూనివర్శిటీ వారు దాదాపు సంవత్సరం పాటు రీసెర్చ్ నిర్వహించారు. రోజు వివిధ రకాలుగా అల్పాహారంను తీసుకునే వారిని మూడు కేటగిరీలుగా విభజించినట్లు తెలిపారు.

సాధారణంగా ఒక మహిళకు రోజుకు 2వేల క్యాలరీస్ కావాలి. పురుషులకైతే 2,500 క్యాలరీస్ కావాలి. కానీ.. వీరు రోజుకు 240 నుంచి 900 వరకు మాత్రమే క్యాలరీస్‌ను తీసుకుంటున్నట్లు తెలియజేశారు. అతి తక్కువ శక్తి ఉన్న అల్పాహారం తినే వారిలో 9.5 శాతం మంది ఉన్నారు. సాధారణమైన అల్పాహారం తినే వారు 15.5 శాతం మంది ఉన్నట్లు పరిశోధనలో తేలింది. అంటే అధిక శక్తి ఉన్న అల్పాహారం తినే వారు కేవలం 8.7 శాతం మందే ఉన్నారు.

అధ్యయన రచయిత డాక్టర్ సోటిరియస్ సలామండ్రిస్ మాట్లాడుతూ.. మంచి ప్రోటీన్స్ ఉన్న అల్పాహారం మన జీవితంలో భాగంగా ఉండాలని అన్నారు. రోజూ క్యాలరీస్ ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా బీపీ, షుగర్ వంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చన్నారు. అలాగే గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చని తెలిపారు. అలాగే.. కొవ్వుతో ఆహారంకంటే ప్రోటీన్స్, పీచు పదార్థాలు కలిగిన ఆహారం మేలని చెప్పారు.

అలాగే.. సోఫాలో కూర్చొని టీవీ రిమోట్ ఆపరేట్ చేసే సమయంలో మన ఇంట్లోని పనులు చేసుకోవడం మంచి పద్దతి అన్నారు. ఉదయాన్నే యోగా, వాకింగ్, జాగింగ్ వంటివి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని తెలియజేశారు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..