
వాతావరణంలో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రతీ మూడు, నాలుగు నెలలకు ఒకసారి సీజన్ మారుతుంది. సీజన్ మారే క్రమంలోనే శరీరంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. సీజన్కి అనుగుణంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. లేదంటే శరీరంలో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది.

చలికాలంలో వెచ్చగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. చలి కాలంలో ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో జీడిపప్పు ఎంతో హెల్ప్ చేస్తుంది. ప్రతి రోజూ కనీసం నాలుగు పప్పులు తిన్నా ఆరోగ్యానికి మంచిది.

వింటర్ సీజన్లో పప్పు తినడం వల్ల శరీరానికి వెచ్చదనం వస్తుంది. ఇందులో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే శరీరానికి ఎనర్జీని కూడా ఇస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

ఇమ్యూనిటీ బలపడితే శీతాకాలంలో వచ్చే జ్వరం, దగ్గు, ఫ్లూ వంటివి రాకుండా ఉంటాయి. ఇన్ఫెక్షన్లు, వైరస్లు ఎటాక్ చేయవు. చర్మానికి కూడా రక్షణగా నిలుస్తుంది. చర్మం పొడి బారడం తగ్గుతుంది. చర్మం హైడ్రేట్ అవుతుంది.

ప్రతి రోజూ నాలుగు పప్పులు జీడిపప్పు తినడం వల్ల శరీరానికి త్వరగా చలి వేయదు. ఎముకలు, కండరాలు బలంగా, దృఢంగా మారతాయి. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. వాపులు వంటివి తగ్గుతాయి. మరీ ఎక్కువగా తింటే సమస్యలు తప్పవు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)