రైతులకు గుడ్ న్యూస్.. వడ్డీ లేకుండా రుణాలు..!

|

Aug 18, 2020 | 2:08 AM

అన్నదాతల ఆదాయాన్ని పెంపొందించేందుకు అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాయి.

రైతులకు గుడ్ న్యూస్.. వడ్డీ లేకుండా రుణాలు..!
Follow us on

Zero Interest Loans For Farmers: దేశానికి రైతే వెన్నుముక. రైతు బాగుంటేనే ప్రజలు ఆనందంగా ఉంటారు. రైతును గౌరవిద్దాం. రైతు రాజు అని ఎలుగెత్తి చాటుదాం. ఇది అందరి నినాదం. ఈ క్రమంలోనే అన్నదాతల ఆదాయాన్ని పెంపొందించేందుకు అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాయి. ఇందులో భాగంగానే హర్యానా ప్రభుత్వం తాజాగా రైతులకు వడ్డీ లేకుండా రుణాలు అందించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఈ అంశంపై ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్ మాట్లాడుతూ.. ”బ్యాంకులు సాధారణంగా 7 శాతం వడ్డీతో రైతులుకు రుణాలు ఇస్తాయని.. ఇక మీదట అలా కాకుండా వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అవుతోందని ఆయన అన్నారు. బ్యాంకులకు కట్టాల్సిన ఏడు శాతం వడ్డీలో నాలుగు శాతం రాష్ట్ర ప్రభుత్వం.. మిగతా 3 శాతం కేంద్ర ప్రభుత్వం భరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఇలా రూ. 3 లక్షల వరకు జీరో వడ్డీ రుణాల ఇవ్వాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దీని వల్ల రైతులకు ఎంతగానో మేలు చేకూరుతుందని ఆయన భావిస్తున్నారు. కాగా రైతుల కోసం 17 వేల కిసాన్ మిత్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Also Read:

ఇకపై గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేయాలంటే.. అది తప్పనిసరి.!

ధోని అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్…

‘కుట్రదారులకు శిక్ష తప్పదు’: హీరో రామ్

కరోనాపై షాకింగ్ న్యూస్.. వైరస్ ఒకటి కాదు.. 73 రకాలు.!