ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులు ఎనలేనివని, ప్రజల కోసం నిరంతరం శ్రమించే సీఎం.. జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెర్నటి శ్యాం ప్రసాద్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కోట మండలం వంజివాక, అల్లంపాడు గ్రామాలలో నవరత్నాలలో భాగమైన పేదలకు ఇళ్లు పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పేద ప్రజల కోసం జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ పట్టాల పంపిణీ కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ గోపాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.