జూమ్ రాజకీయాలు చేయకుబాబూ

టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి జూమ్ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. బాబును ప్రజలు మరిచిపోయారని..

జూమ్ రాజకీయాలు చేయకుబాబూ
Follow us

|

Updated on: Aug 31, 2020 | 3:34 PM

టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి జూమ్ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. బాబును ప్రజలు మరిచిపోయారని.. అందుకే టెక్నాలజీ వాడుకొని ప్రతిపక్షం ఉన్నట్లు భ్రమ కల్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌ జరుగుతుందనడం అవాస్తవమన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పారు. ఎల్లో మీడియా ద్వారా తనపై దుష్ప్రచారం చేస్తుందని విమర్శించారు. తనపై దురుద్దేశంతో కావాలనే పిల్ వేశారని చెప్పారు. తన నియోజకవర్గంలో ఎలాంటి అన్యాయాలు, అక్రమాలు జరగడంలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు దుష్ట రాజకీయాలకు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. దళితులపై దౌర్జన్యం చేస్తే ఎంతటి వారినైనా ప్రభుత్వం ఊపేక్షించదని చెప్పుకొచ్చారు. ఆయన సోమవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ రాష్ట్రంలో చేయని సంక్షేమ కార్యక్రమాలు ఏపీలో అమలవుతున్నాయని పేర్కొన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ప్రభుత్వం రూ.4వేల కోట్లు ఆదా చేసిందని చెప్పారు.