Husband Kills Wife : ఇతర వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు, వారిస్తే ఎదురు తిరగడాలు..పదే, పదే గొడవలతో విసిగి వేసారిపోయిన ఆ భర్త గొంతు కోసి భార్యను హత్యచేశాడు. అయితే ఈ ఘటనపై విచారణ చేస్తోన్న పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. సదరు మహిళకు గతంలో తొమ్మిడి పెళ్లిళ్లు అయ్యాయని, తొమ్మిదో భర్త చేతిలో హత్యకు గురైందని తెలిసింది. పహాడీషరీఫ్ ఠాణా ఎస్సై కుమారస్వామి తెలిపిన వివరాల ప్రకారం..ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన నాగరాజు మూడేళ్లుగా రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపల్ పరిధి శ్రీరామకాలనీలో ఉంటూ క్యాబ్ తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నాగరాజుకు స్థానికంగా ఉండే వరలక్ష్మి(30)తో పరిచయం ఏర్పడింది. ఆమె కాటేదాన్ పారిశ్రామికవాడలోని ఓ పెట్రోల్ బంకులో వర్క్ చేస్తోంది. అప్పటికే ఆమెకు భర్త, కుమారుడు ఉన్నారు. నాగరాజు, వరలక్ష్మి మధ్య పరిచయం కాస్తా.. ప్రేమగా మారడంతో వరలక్ష్మి రెండేళ్ల క్రితం తన భర్తను వదిలేసి నాగరాజును వివాహాం చేసుకుంది. కొద్దిరోజులు వీరి కాపురం బాగానే సాగినా, ఆ తర్వాత వరలక్ష్మి కొత్త వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం నాగరాజు కంటపడింది. దీంతో గొడవలు మొదలయ్యాయి.
Read More : మహిళా గ్రామ వాలంటీర్పై వృద్ధుడి అసభ్య ప్రవర్తన..నిర్భయ కేసు నమోదు
మూడు రోజుల క్రితం ఈ విషయంపై పెద్ద గొడవ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున కూడా గొడవ జరిగింది. ఈ సమయంలో నాగరాజు ఆగ్రహంతో భార్య గొంతు కోసి హతమార్చాడు. నేరుగా పహాడీషరీఫ్ ఠాణాకు వెళ్లి జరిగింది చెప్పి లొంగిపోయాడు. అయితే వరలక్ష్మికి నాగరాజు తొమ్మిదో భర్త అని విచారణలో తేలింది. పెళ్లి అనంతరం ఇతర వ్యక్తులతో సన్నిహితంగా ఉండడం, గొడవలు జరిగి భర్తలతో విడిపోయి మళ్లీ పెళ్లి చేసుకునేదని ఎస్సై తెలిపారు.