తొలి టెస్టు విజేత విండీస్.. ఇంగ్లాండ్ పై ఘన విజయం..

| Edited By:

Jul 13, 2020 | 6:47 AM

కరోనా సంక్షోభ సమయంలో అంచనాలకు మించి రాణించిన వెస్టిండీస్‌ జట్టు గెలుపు బోణీ కొట్టింది. తొలి టెస్టులో మొదటి రోజు మినహా ప్రతీ రోజూ పైచేయి సాధించిన వెస్టిండీసే విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో

తొలి టెస్టు విజేత విండీస్.. ఇంగ్లాండ్ పై ఘన విజయం..
Follow us on

కరోనా సంక్షోభ సమయంలో అంచనాలకు మించి రాణించిన వెస్టిండీస్‌ జట్టు గెలుపు బోణీ కొట్టింది. తొలి టెస్టులో మొదటి రోజు మినహా ప్రతీ రోజూ పైచేయి సాధించిన వెస్టిండీసే విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్‌ను ఓడించింది. ఇంగ్లండ్‌ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని విండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 64.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి అధిగమించింది. ఆర్చర్‌ (3/45) దెబ్బకు ఆఖరి మజిలీ రసవత్తరం అవుతుందనుకుంటే… జెర్మయిన్‌ బ్లాక్‌వుడ్‌ (154 బంతుల్లో 95; 12 ఫోర్లు) ఆ అవకాశమివ్వలేదు. చేజ్, డౌరిచ్‌లతో కలిసి రెండు విలువైన భాగస్వామ్యాలతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఆఖర్లో ఇంగ్లండ్‌ పేసర్‌ ఆర్చర్‌ ఆశలు రేకెత్తించినా.. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ జెర్మయిన్‌ బ్లాక్‌వుడ్‌ పోరాటం చివరకు విండీస్‌నే విజయం వరించేలా చేసింది. పేలవమైన ఫీల్డింగ్‌తో ఇంగ్లండ్‌ మూల్యం చెల్లించుకుంది.

Also Read: ఫలించిన చర్చలు.. స్వదేశానికి 367 మంది భారతీయులు..!