విశాఖ మెంట‌ల్ ఆస్పత్రి నుంచి డాక్టర్​ సుధాకర్​ డిశ్చార్జ్​…

| Edited By: Pardhasaradhi Peri

Jun 06, 2020 | 9:36 AM

హైకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో విశాఖ గ‌వ‌ర్న‌మెంట్ మెంట‌ల్ ఆస్ప‌త్రి నుంచి నుంచి వైద్యుడు సుధాకర్​ డిశ్చార్జ్​ అయ్యారు.

విశాఖ మెంట‌ల్ ఆస్పత్రి నుంచి డాక్టర్​ సుధాకర్​ డిశ్చార్జ్​...
Follow us on

హైకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో విశాఖ గ‌వ‌ర్న‌మెంట్ మెంట‌ల్ ఆస్ప‌త్రి నుంచి నుంచి వైద్యుడు సుధాకర్​ డిశ్చార్జ్​ అయ్యారు. కోర్టు తీర్పుల కాపీలను హాస్పిట‌ల్ అధికారులకు అందించిన సుధాకర్​ తల్లి కావేరి బాయి, బంధువు విజయ్​కుమార్, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితలు..ఫార్మాలిటీస్ పూర్త‌యిన అనంత‌రం ఆయన్ను​ బయటకు తీసుకువచ్చారు. సుధాకర్​కు కొన్నాళ్లు ప్రైవేటు ఆస్పత్రిలో ఉంచి ట్రీట్మెంట్ అందించనున్నట్లు వంగలపూడి అనిత వెల్ల‌డించారు.

డాక్ట‌ర్ సుధాకర్​ ను గత నెల 16న గ‌వ‌ర్న‌మెంట్ మెంట‌ల్ ఆస్ప‌త్రిలో పోలీసులు చేర్చారు. కాగా తన కుమారుడు ఎవరి ఆధీనంలో ఉన్నాడో తెలిపి, వెంట‌నే కోర్టులో హాజ‌రుప‌ర‌చాలంటూ సుధాకర్​ తల్లి హైకోర్టులో గురువారం హెబియస్​ కార్పస్​ పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై శుక్ర‌వారం విచారించిన ఉన్నత న్యాయస్థానం..సూప‌రెండెంట్ అనుమ‌తితో సుధాకర్​ను డిశ్చార్జ్​ చెయ్యాలని ఆదేశించింది. మ‌రోవైపు సీబీఐ విచార‌ణ‌లో స‌హ‌క‌రించాల‌ని సుధాక‌ర్ కు సూచించింది.