తొలి టెస్టులో ఓడిపోయినా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూకుడు మీదున్న టీమిండియా సారథి..నెంబర్ వన్ స్థానానికి మరింత దగ్గరగా విరాట్

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఓటమి చవిచూసింది. అయితే తాజాగా విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్​ పాయిట్ల పట్టికలో మాత్రం భారత జట్టు సారథి కోహ్లీ దూకుడు కొనసాగుతోంది.

తొలి టెస్టులో ఓడిపోయినా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూకుడు మీదున్న టీమిండియా సారథి..నెంబర్ వన్ స్థానానికి మరింత దగ్గరగా విరాట్

Updated on: Dec 21, 2020 | 12:18 AM

ICC Men’s Test Player Rankings : ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఓటమి చవిచూసింది. అయితే తాజాగా విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్​ పాయిట్ల పట్టికలో మాత్రం భారత జట్టు సారథి కోహ్లీ దూకుడు కొనసాగుతోంది . తొలి ఇన్నింగ్స్​లో 74 పరుగులు చేసిన కోహ్లీ రెండు పాయింట్లను ఖాతాలో వేసుకుని రెండో స్థానాన్ని మరింత పదిలపర్చుకుని మొదటి స్థానంలో ఉన్న స్టీవ్ స్మిత్​కు దగ్గరగా చేరుకున్నాడు.

ఇదిలావుంటే.. రెండు ఇన్నింగ్స్​ల్లోనూ కేవలం 1 పరుగుకే పరిమితమైన స్మిత్​ 10 పాయింట్లను కోల్పోయాడు. ప్రస్తుతం కోహ్లీ 888, స్మిత్ 911 పాయింట్లతో తమ స్థానాల్లో కొనసాగుతున్నారు. అయితే మిగిలిన మూడు టెస్టుల్లో కోహ్లీ ఆడటం లేదు.. దీంతో స్మిత్​ చేసే ప్రతి పరుగు పాయిట్ల పట్టికలో ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

మొదటి టెస్టులో 47, 6 పరుగులు చేసిన లబుషేన్ కెరీర్​లో అత్యుత్తమంగా 839 పాయింట్లను సాధించి నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ సారథి విలియమ్సన్ మూడో ర్యాంకులో నిలిచాడు. మొదటి ఇన్నింగ్స్​లో 43 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్​లో డకౌటైన పుజారా ఓ స్థానాన్ని కోల్పోయి 8వ ర్యాంకులో నిలిచాడు. ఇంగ్లాండ్ ఆల్​రౌండర్ బెన్ స్టోక్స్ ఏడో స్థానానికి కదిలాడు.