కరోనాకు గబ్బిలమే కారణమన్నా..లొట్టలేసుకుంటూ లాగించేసింది..

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ముఖ్యంగా  చైనాలో ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.  ఇప్పటికే ఈ వైరస్ ఎంతోమంది ప్రాణాలను తీసింది. ఈ ప్రమాదకర వైరస్‌‌కు కారణం గబ్బిలాలు, పాములు అని శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాటికి దూరంగా ఉండమని హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిస్థితుల్లో కూడా చైనాకు చెందిన ఓ మహిళ గబ్బిలాన్ని తినడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఓ రెస్టారెంట్‌లో గబ్బిలంతో చేసిన సూప్‌ను ఆమె లాగించేసింది. అంతేనా […]

కరోనాకు గబ్బిలమే కారణమన్నా..లొట్టలేసుకుంటూ లాగించేసింది..

Edited By:

Updated on: Jan 24, 2020 | 6:45 PM

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ముఖ్యంగా  చైనాలో ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.  ఇప్పటికే ఈ వైరస్ ఎంతోమంది ప్రాణాలను తీసింది. ఈ ప్రమాదకర వైరస్‌‌కు కారణం గబ్బిలాలు, పాములు అని శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాటికి దూరంగా ఉండమని హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిస్థితుల్లో కూడా చైనాకు చెందిన ఓ మహిళ గబ్బిలాన్ని తినడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఓ రెస్టారెంట్‌లో గబ్బిలంతో చేసిన సూప్‌ను ఆమె లాగించేసింది. అంతేనా గబ్బిలంను వదిలిపెట్టలేదు. గబ్బిలం మాంసం తినాలి చర్మంను తినకూడదని అక్కడే ఉన్న ఓ వ్యక్తి  చైనీస్ లాంగ్వేజ్‌లో చెప్తున్నట్టు అర్దమవుతోంది. ప్రస్తుతం ఈ వైరస్ వలన 10 సంఖ్యలో ప్రజలు మరణించారు. దాదాపు 1000 మంది చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు భారత్‌లో  కూడా కరోనా వైరస్‌ గురించి డాక్టర్లు అప్రమత్తత ప్రకటించారు.