AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు

ఎట్టకేలకు ఉత్తరాఖండ్‌ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్‌ నేగిపై పోలీసులు అత్యాచారం, నేరపూరిత కుట్రల కింద కేసు పెట్టగలిగారు.. ఆయన భార్య రీటాపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు
Balu
|

Updated on: Sep 07, 2020 | 2:25 PM

Share

ఎట్టకేలకు ఉత్తరాఖండ్‌ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్‌ నేగిపై పోలీసులు అత్యాచారం, నేరపూరిత కుట్రల కింద కేసు పెట్టగలిగారు.. ఆయన భార్య రీటాపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే దంపతులపై ఐపీసీ 376 , 506 కింద కేసులు నమోదు చేశామని చెప్పారు నెహ్రూ కాలనీ పోలీసులు.. మహేశ్‌ నేగి తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని, ఆయన కారణంగా ఓ పాపకు తల్లినయ్యానని ఓ మహిళ మొన్న 16న పోలీసులకు కంప్లయింట్‌ చేసింది.. తాను చెప్పింది అబద్ధమని భావిస్తే తన బిడ్డకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించుకోవచ్చని సవాల్‌ విసిరింది.. ఈ ఫిర్యాదు తర్వాత పోలీసులు మహేశ్‌ నేగిపై కేసు పెట్టే విషయంపై తర్జనభర్జన పడ్డారు.. ఈ ఇష్యూను ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ప్రజల ముందుకు తీసుకెళ్లింది.. పైగా రాజకీయ దుమారం చెలరేగడంతో పోలీసులు ప్రాథమిక ఆధారలు సేకరించి ఎమ్మెల్యే దంపతులపై కేసు పెట్టారు . ఇప్పటికీ తానేమీ తప్పు చేయలేదని అంటున్నారు ద్వారాహత్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే మహేశ్‌ నేగి. కాంగ్రెస్‌ పార్టీ కుట్రల కారణంగానే తనపై తప్పుడు ఆరోపణలు వచ్చాయని, ఆ మహిళ ఎవరో తనకు తెలియదని అంటున్నారు.. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని చెప్పారు.