బ్రిటన్ మ్యుటెంట్ వైరస్ ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం, ముందు జాగ్రత్తగా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం, అమెరికా

| Edited By: Ram Naramaneni

Dec 21, 2020 | 11:26 AM

బ్రిటన్ లో ప్రబలిన మ్యుటెంట్ వైరస్ ని జాగ్రత్తగా పరిశిలీస్తున్నామని, అయితే ఆ దేశానికి ట్రావెల్ ఆంక్షలపై తామింకా దృష్టి పెట్టలేదని అమెరికా అధికారులు తెలిపారు.

బ్రిటన్ మ్యుటెంట్ వైరస్ ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం, ముందు జాగ్రత్తగా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం, అమెరికా
Follow us on

బ్రిటన్ లో ప్రబలిన మ్యుటెంట్ వైరస్ ని జాగ్రత్తగా పరిశిలీస్తున్నామని, అయితే ఆ దేశానికి ట్రావెల్ ఆంక్షలపై తామింకా దృష్టి పెట్టలేదని అమెరికా అధికారులు తెలిపారు. ఏమైనప్పటికీ, ముందు జాగ్రత్తచర్యగా 75 ఏళ్ళు, అంతకన్నా వయస్సు పైబడిన వృధ్ధులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని నిపుణులతో కూడిన పానెల్ సిఫారసు చేసింది. పోలీసులు, టీచర్లు, గ్రాసరీ స్టోర్స్ లో పని చేసే ఉద్యోగులతో సహా 3 కోట్లమంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు కూడా టీకామందు ఇవ్వనున్నారు. బ్రిటన్ వైరస్ గురించి అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఆపరేషన్ వార్ప్ స్పీడ్ వ్యాక్సిన్ ప్రోగ్రాం; చీఫ్ అడ్వైజర్ మోన్సెస్ వివరిస్తూ..తమ దేశంలో బ్రిటన్ వైరస్ ఉందా.లేదా అన్న విషయం ఇంకా తెలియడంలేదన్నారు. ఏమైనా ఈ అంశాన్ని కూలంకషంగా పరిశీలిస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకామందులను తట్టుకోగల వైరస్ స్ట్రెయిన్ ఏదీ కనిపించడంలేదన్నారు.పరిశోధనలు జరుగుతున్నాయి గానీ ఇప్పటివరకు దీనిపై స్పష్టమైన అంశమేదీ వెల్లడి కాలేదు అని అన్నారు.

బ్రిటన్ మ్యుటెంట్ వైరస్ వాక్సిన్ ఇమ్యూనిటీ నుంచి తప్పించుకోజాలదని భావిస్తున్నట్టు మొన్సెస్ చెప్పారు. ఏది ఏమైనా మరీ అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. గత వారం రోజులుగా 2.8 మిలియన్ వ్యాక్సిన్ డోసులను 556,208 మందికి ఇఛ్చినట్టు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తెలిపింది. ఇప్పటివరకు అమెరికాలో 3 లక్షల మందికి పైగా కరోనా రోగులు మృతి చెందారు.