యూపీలో బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై లైంగికదాడి

|

Aug 30, 2020 | 10:33 AM

నిత్యం ఏదో ఒకచోట లైంగికదాడులకు బలవుతూనే ఉన్నారు. పదేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ లాంటి ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై లైంగిక దాడికి తెగబడ్డారు.

యూపీలో బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై లైంగికదాడి
Follow us on

ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన మానమృగాలు రెచ్చిపోతున్నాయి. కామాంధులకు కఠిన శిక్షలు పడుతున్న మార్పు రావడం లేదు. మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఏదో ఒకచోట లైంగికదాడులకు బలవుతూనే ఉన్నారు. పదేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ లాంటి ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై లైంగిక దాడికి తెగబడ్డారు.

ఢిల్లీ రోహిణి చెందిన మహిళ శనివారం తెల్లవారుజూమున లక్నో నుంచి ఢిల్లీకి వచ్చేందుకు ప్రైవేట్‌ బస్సు ఎక్కింది. ఉదయం బస్సు మధురాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌ వేపై మాంట్ టోల్ ప్లాజాకు చేరుకోగానే బస్ క్లీనర్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు 112 హెల్ప్‌లైన్‌ నెంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బస్సును నిలిపి బాధిత మహిళను, క్లీనర్ను కిందకు దించి బస్సును తనిఖీ చేశారు. బాధితురాలిని వైద్య పరీక్ష చేయించి పోలీసుల పర్యవేక్షణలో ఢిల్లీ ప్రాంతంలోని ఇంటికి చేర్చారు. నేరానికి పాల్పడిన బహ్రాయిచ్ జిల్లాకు చెందిన నిందితుడు రవిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.