విశాఖలో ఇక నుంచి ట్రాఫిక్ ఆంక్షలు.. కారణం ఇదే!

| Edited By:

Jan 17, 2020 | 10:02 AM

విశాఖలో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ఈ నెల 26వ తేదీన గణతంత్ర వేడుకలను విశాఖ సాగర తీరాన నిర్వహించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో.. నేటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకూ బీచ్‌రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు అధికారులు. అంతేగాక బీచ్ రోడ్డులో పరేడ్ కూడా ప్రాక్టీస్ చేయనున్నారు. ఈ రోజు ఉదయం నుంచి, 25వ తేదీ వరకూ ఉదయం 5.30 నుంచి 11.30 […]

విశాఖలో ఇక నుంచి ట్రాఫిక్ ఆంక్షలు.. కారణం ఇదే!
Follow us on

విశాఖలో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ఈ నెల 26వ తేదీన గణతంత్ర వేడుకలను విశాఖ సాగర తీరాన నిర్వహించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో.. నేటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకూ బీచ్‌రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు అధికారులు. అంతేగాక బీచ్ రోడ్డులో పరేడ్ కూడా ప్రాక్టీస్ చేయనున్నారు. ఈ రోజు ఉదయం నుంచి, 25వ తేదీ వరకూ ఉదయం 5.30 నుంచి 11.30 గంటల వరకూ, అలాగే మధ్యాహ్నం 3 నుంచి సాయంత్ర 5.30 గంటల వరకూ ప్రాక్టీస్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా సమయాల్లో ట్రాఫిక్‌ను మళ్లించాల్సి ఉంటుంది గనుక.. దీన్ని ప్రజలు గమనించి, వారికి సహకరించాలని ట్రాఫిక్ రూల్స్ విభాగం విజ్ఞప్తి చేశారు.