టాప్ 10 న్యూస్ @ 6PM

1.పట్టువదలని కేసీఆర్.. స్టాలిన్ కోసం మరోసారి చెన్నై పయనం తెలంగాణ సీఎం కేసీఆర్ చెన్నైకు బయల్దేరారు. సోమవారం స్టాలిన్‌తో భేటీ అవ్వనున్న ఆయన.. ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే శ్రీరంగంతో పాటు మరికొన్ని దేవాలయాలను కేసీఆర్ దంపతులు దర్శించుకోనున్నారు…Read more 2.ముగిసిన ఆరో దశ ఎన్నికల పోలింగ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ జరిగిన ఆరో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు […]

టాప్ 10 న్యూస్ @ 6PM

Updated on: May 12, 2019 | 5:57 PM

1.పట్టువదలని కేసీఆర్.. స్టాలిన్ కోసం మరోసారి చెన్నై పయనం

తెలంగాణ సీఎం కేసీఆర్ చెన్నైకు బయల్దేరారు. సోమవారం స్టాలిన్‌తో భేటీ అవ్వనున్న ఆయన.. ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే శ్రీరంగంతో పాటు మరికొన్ని దేవాలయాలను కేసీఆర్ దంపతులు దర్శించుకోనున్నారు…Read more

2.ముగిసిన ఆరో దశ ఎన్నికల పోలింగ్

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ జరిగిన ఆరో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది…Read more

3.తలా వెర్సస్ హిట్‌మ్యాన్… ఈసారి టైటిల్ ఎవరిది.?

ఊహించని విజయాలు, అనుకోని పరాజయాలు.. కొన్ని వివాదాలు, మరికొన్ని వినోదాలు ఇలా రసవత్తరంగా సాగింది ఈ ఏడాది ఐపీఎల్. చూస్తూ చూస్తూనే ఐపీఎల్ చివరి అంకంకు చేరుకుంది. మూడేసి సార్లు టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్…Read more

4.ఆ లేడి పోలింగ్ ఆఫీసర్ ఎవరంటే..!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని  ఓ లేడి పోలింగ్ ఆఫీసర్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. రెండు చేతుల్లోనూ ఈవీఎం బాక్స్‌లను పట్టుకొని చాలా మోడ్రన్ లుక్‌లో ఈ అధికారి కనిపించేసరి…Read more

5.ప్రముఖ నిర్మాత బి.వెంకట్రామిరెడ్డి కన్నుమూత

ప్రముఖ నిర్మాత, పారిశ్రామికవేత్త వెంకట్రామిరెడ్డి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు…Read more

6.ఎన్నికల్లో ప్రేమదే విజయం : రాహుల్‌

ఈ ఎన్నికల్లో ప్రేమే విజయం సాధిస్తుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్‌ కొనసాగుతోంది. రాహుల్‌ గాంధీ ఢిల్లీలోని ఔరంగజేబ్‌ లేన్‌లోని ఎన్‌పీ సీనియర్‌…Read more

7.ఓటేసిన ప్రముఖులు..!

దేశంలోని కీలక నేతల భవితవ్యం తేల్చే ఆరో దశ పోలింగ్ ప్రారంభమైంది. 59 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఈ దశలో యూపీలో 14 పార్లమెంట్ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది.. Read more

8.మంచు విష్ణు వల్ల నా ప్రాణాలకు ముప్పు – ఓటర్ డైరెక్టర్

మంచు విష్ణు హీరోగా జి.ఎస్.కార్తీక్ రెడ్డి డైరెక్షన్‌లో రూపొందుతున్న చిత్రం ‘ఓటర్’ వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈపాటికే రిలీజ్ కావాల్సిన సినిమా వివాదం వల్ల వాయిదా పడింది. హీరో విష్ణుకి…Read more

9.ఐపీఎల్ ఫైనల్‌కు హోస్టులుగా బాలీవుడ్‌ జంట

ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్ 12వ సీజన్‌ తుది దశకు చేరుకుంది. నేడు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ మైదానంలో ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది…Read more

10.పేదల కులమే నా కులం.. విపక్షాలకు మోదీ కౌంటర్

మోదీ బీసీ కాదంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు. సమాజ్‌‌వాదీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యూపీని నాశనం చేశారని.. బీజేపీ అధికారంలోకి వచ్చాక యూపీ ప్రజలకు…Read more

Loading...
Unable to load recommendations.
Follow Us