బీజేపీలో తృణమూల్ నేతల వలసల పర్వం

| Edited By:

Jun 25, 2019 | 11:17 AM

బెంగాల్ బీజేపీలోకి తృణమూల్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వలసల పరంపర కొనసాగుతోంది. తాజాగా తృణమూల్ ఎమ్మెల్యే విల్సన్ చాంప్రామరీ బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. దక్షిణ్ దింజాపూర్ జిల్లాలోని ఓ స్థానిక చైర్‌పర్సన్‌గా ఉన్న లిపికారాయ్‌తో పాటు పలువురు పార్టీ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం న్యూఢిల్లీలోని కమలదళం కేంద్ర కార్యాలయంలో బీజేపీ బెంగాల్‌ రాష్ట్ర అధక్షుడు దిలీప్‌ ఘోష్‌, కీలక నేతలు ముకుల్‌ రాయ్‌, కైలాశ్‌ విజయ్‌వర్గీయల సమక్షంలో వారు పార్టీలో చేరారు. కల్చిని స్థానం నుంచి […]

బీజేపీలో తృణమూల్ నేతల వలసల పర్వం
Follow us on

బెంగాల్ బీజేపీలోకి తృణమూల్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వలసల పరంపర కొనసాగుతోంది. తాజాగా తృణమూల్ ఎమ్మెల్యే విల్సన్ చాంప్రామరీ బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. దక్షిణ్ దింజాపూర్ జిల్లాలోని ఓ స్థానిక చైర్‌పర్సన్‌గా ఉన్న లిపికారాయ్‌తో పాటు పలువురు పార్టీ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం న్యూఢిల్లీలోని కమలదళం కేంద్ర కార్యాలయంలో బీజేపీ బెంగాల్‌ రాష్ట్ర అధక్షుడు దిలీప్‌ ఘోష్‌, కీలక నేతలు ముకుల్‌ రాయ్‌, కైలాశ్‌ విజయ్‌వర్గీయల సమక్షంలో వారు పార్టీలో చేరారు. కల్చిని స్థానం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నేపథ్యం చాంప్రామరీకి ఉంది.