
శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. భామిని, సీతంపేట, వీరఘట్టం, పాలకొండ, రాజాం, వంగర మండలాలకు పిడుగు ప్రభావం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు.