గుంటూరు జిల్లా : ముగ్గురి ప్రాణం తీసిన బంతాట‌…

|

Jul 24, 2020 | 12:07 AM

గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బంతాట ముగ్గురి ప్రాణాలను తీసింది.

గుంటూరు జిల్లా : ముగ్గురి ప్రాణం తీసిన బంతాట‌...
Follow us on

గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బంతాట ముగ్గురి ప్రాణాలను తీసింది. నీటికుంటలో పడిన బంతి కోసం వెళ్లి ప్రమాదవశాత్తూ ముగ్గురు టీనేజ‌ర్లు మృత్యువాతపడ్డారు. గుంటూరు జిల్లా కాకుమానులో ఈ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. కాకుమానుకి చెందిన అరి రాకేష్(17), కాండ్రు పవన్(15), జి.కిరణ్(15) మిత్రుల‌తో కలసి ఊరి చివర శివార్లో బంతాట ఆడుకునేందుకు వెళ్లారు. అందులో ఒక‌రు విసిరిన బంతి నీటి కుంటలో పడిపోవడంతో తీసేందుకు ప్రయత్నించినట్లు స‌మాచారం.

ఆ ప్రయత్నంలో ముందు ఒకరి కుంటలో ప‌డ‌గా..అత‌డిని ర‌క్షించేందుకు మిగ‌తా ఇద్ద‌రూ కూడా కుంటలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ప్ర‌మాద‌వ‌శాత్తూ ముగ్గ‌రు మునిగిపోయారు. నీటిలో మునిగిపోవడంతో పవన్, రాకేష్ అక్కడికక్కడే చనిపోగా కిరణ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు విడిచాడు. చనిపోయిన ముగ్గురు ఒకే వీధికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాద ఛాయ‌లు అల‌ముకున్నాయి. సంఘటనా స్థలాన్ని తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎస్సై సౌందర్య రాజన్​లు పరిశీలించారు.