తిరుమలలో దొంగల హల్‌చల్..మంత్రి బంధువుల సొత్తు చోరీ

| Edited By:

Jul 03, 2019 | 4:00 PM

తిరుమలలోని మణిమంజరి గెస్ట్ హౌస్ లో భారీ చోరీ జరిగింది. మంగళవారం రాత్రి కొందరు దొంగలు ఈ అతిథి గృహంలో బస చేసిన 13 మంది భక్తులకు చెందిన 10 తులాల బంగారు నగలు, డైమండ్ నెక్లెస్, రూ. 2 లక్షల నగదు, రెండు సెల్ ఫోన్లు దోచుకుపోయారు. బాధితులు ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీప బంధువులని తెలుస్తోంది. వారి ఫిర్యాదు మేరకు తిరుమల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. డాగ్ […]

తిరుమలలో దొంగల హల్‌చల్..మంత్రి బంధువుల సొత్తు చోరీ
Follow us on

తిరుమలలోని మణిమంజరి గెస్ట్ హౌస్ లో భారీ చోరీ జరిగింది. మంగళవారం రాత్రి కొందరు దొంగలు ఈ అతిథి గృహంలో బస చేసిన 13 మంది భక్తులకు చెందిన 10 తులాల బంగారు నగలు, డైమండ్ నెక్లెస్, రూ. 2 లక్షల నగదు, రెండు సెల్ ఫోన్లు దోచుకుపోయారు.
బాధితులు ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీప బంధువులని తెలుస్తోంది. వారి ఫిర్యాదు మేరకు తిరుమల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. డాగ్ స్క్వాడ్ తో ఈ గెస్ట్ హౌస్ అంతా గాలింపు చేపట్టారు. ఆ వెనుక ప్రాంతంలో బసచేసిన మహిళల ఖాళీ పర్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ పనిచేసే 8 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల లేకపోవడంతో దొంగలను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది.