ముస్లింల ఇంట గణేషుడు, లక్షీదేవికి ఘనంగా పూజలు..!

|

Nov 12, 2020 | 1:33 PM

భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందే పండుగల్లో దీపావళి ఒకటి. ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి.

ముస్లింల ఇంట గణేషుడు, లక్షీదేవికి ఘనంగా పూజలు..!
Follow us on

భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందే పండుగల్లో దీపావళి ఒకటి. ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. దేశంలో దీపావళి కోలాహలం అప్పుడే మొదలైంది. ఈ పండుగను హిందువులు ఎక్కువగా ఉత్సాహంగా జరుపుకోవడం అందరికీ తెలిసిందే. అయితే, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఒక ముస్లిం కుంటుంబం గత 14 ఏళ్లుగా క్రమం తప్పకుండా దీపావళి సంబరాలను చేసుకుంటోంది. 14 ఏళ్ల క్రితం కార్తీకమాసంలో వచ్చే ధన్‌తేరస్ నాడు వీరి ఇంట్లో కవలలు జన్మించారు. దీంతో అప్పటి నుంచి వీరి ఇంట్లో దీపాలు వెలిగించి, దీపావళి చేసుకోవడం ప్రారంభించారు.

భోపాల్ ప్రాంతానికి చెందిన ఇక్బాల్ కుటుంబం ప్రతిఏటా దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకోవడం అనవాయితీ వస్తుంది. వీరి ఇంట ఈద్ వేడుకలు ఎలా జరుగుతాయో దీపావళి వేడుకలు కూడా అంతే అనందోత్సావల మధ్య జరుగుతాయి. వీరి ఇంట జన్మించిన కవలలకు హ్యాపీ, హనీ అనే పేర్లు పెట్టారు. ఈసారి వీరి ఇంట్లో దీపావళి సందర్భంగా గణేశునికి, లక్షీదేవికి ఘనంగా పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఈ కవలల తల్లి రెషు మాట్లాడుతూ ధన్‌తేరస్ రోజున తమ ఇంట్లో కవలలు జన్మించారని, అప్పటి నుంచి దీపావళి వేడుకలు చేసుకుంటున్నామని తెలిపారు.