కాబోయే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన.. బాధ్యతలు చేపట్టక చేయబోయే తొలి సంతకం దానికేనట..!

త్వరలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

కాబోయే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన.. బాధ్యతలు చేపట్టక చేయబోయే తొలి సంతకం దానికేనట..!

Updated on: Dec 11, 2020 | 11:51 AM

త్వరలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తొలి 100 రోజుల్లోనే కరోనాపై పోరాటానికి మూడంచెల ప్రణాళికను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో బాగంగా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన మొదటిరోజే కొవిడ్ నిబంధనలు కఠినతరం చేస్తూ ఉత్తర్వులపై మొదటి సంతకం చేస్తానని జో బైడెన్‌ చెప్పారు. జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలపై అంక్షలతో పాటు బస్సులు, రైళ్లతో పాటు బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తామన్నారు జో బైడెన్‌. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్రాల గవర్నర్లు, నగరాల మేయర్ల సహకారం తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా 10 కోట్ల కొవిడ్‌ వ్యాక్సినేషన్లు అందుబాటులోకి తెస్తామన్నారు. దేశవ్యాప్తంగా విద్యాలయాలు వీలైనంత త్వరగా తెరుచుకునేందుకు అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన నిధులను కాంగ్రెస్‌ అందించాలని బైడెన్ కోరారు.

Follow Us