నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించిన సీఎం కేసీఆర్

|

Oct 21, 2020 | 6:58 PM

అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డిని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రామ‌ర్శించారు. బుధ‌వారం సాయంత్రం జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రికి వెళ్లిన సీఎం కేసీఆర్.. నాయినిని ప‌రామ‌ర్శించిన అనంత‌రం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాల‌ని వైద్యుల‌కు కేసీఆర్ సూచించారు. నాయిని కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడిన సీఎం కేసీఆర్ ధైర్యం చెప్పారు. గత నెల 28న కరోనా బారినపడిన నాయిని.. బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 16 రోజులపాటు చికిత్స […]

నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించిన సీఎం కేసీఆర్
Follow us on

అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డిని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రామ‌ర్శించారు. బుధ‌వారం సాయంత్రం జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రికి వెళ్లిన సీఎం కేసీఆర్.. నాయినిని ప‌రామ‌ర్శించిన అనంత‌రం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాల‌ని వైద్యుల‌కు కేసీఆర్ సూచించారు. నాయిని కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడిన సీఎం కేసీఆర్ ధైర్యం చెప్పారు.

గత నెల 28న కరోనా బారినపడిన నాయిని.. బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 16 రోజులపాటు చికిత్స పొందారు. ఇటీవ‌ల‌ నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు నెగెటివ్‌ వచ్చింది. అయితే, ఆయన ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో పరీక్షించిన వైద్యులు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకినట్టు గుర్తించారు. ఆక్సిజన్‌ పడిపోవడంతో ఈ నెల 13న‌ తిరిగి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అప్పటినుంచి ఆయనకు వైద్యులు పర్యవేక్షణలో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు.