తెలంగాణ శాస‌న‌స‌భ రేప‌టికి వాయిదా

|

Sep 08, 2020 | 1:22 PM

మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి  కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానాన్ని స‌భ ఏక‌గ్రీవంగా ఆమోదించింది. స‌భ్యులంద‌రూ ఈ తీర్మానానికి సంపూర్ణ మ‌ద్ద‌తు ప్రకటించారు. అనంత‌రం స‌భ‌ను బుధ‌వారానికి వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు...

తెలంగాణ శాస‌న‌స‌భ రేప‌టికి వాయిదా
Follow us on

మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి  కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానాన్ని స‌భ ఏక‌గ్రీవంగా ఆమోదించింది. స‌భ్యులంద‌రూ ఈ తీర్మానానికి సంపూర్ణ మ‌ద్ద‌తు ప్రకటించారు. అనంత‌రం స‌భ‌ను బుధ‌వారానికి వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు.

మ‌ళ్లీ బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు శాస‌న‌స‌భ ప్రారంభం కానుంది. రేప‌ట్నుంచి గంట పాటు ప్ర‌శ్నోత్త‌రాలు కొన‌సాగ‌నున్నాయి. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో కేవ‌లం 6 ప్ర‌శ్న‌ల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇవ్వ‌నున్నారు. ప్ర‌శ్నోత్త‌రాలు ముగిసిన అనంత‌రం జీరో అవ‌ర్ అర గంట పాటు కొన‌సాగ‌నుంది. అనంత‌రం సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చ‌ట్టాన్ని స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. 10, 11 తేదీల్లో కొత్త రెవెన్యూ చ‌ట్టంపై స‌భ‌లో చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. ఈనెల 12, 13, 20, 27 తేదీల్లో శాసనసభకు సెలవులు ఇవ్వనున్నారు. మొత్తం 18రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి.