ఇసుక కోసం.. బీజేపీ మద్దతు కోరిన టీడీపీ..!

గత కొన్ని రోజులుగా.. ఏపీలో ఇసుక కొరతపై రచ్చ రచ్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. జనానికి అందని ఇసుక- రాజకీయ తుఫాన్‌గా మారింది. ఒకవైపు లాంగ్‌మార్చ్‌లు, ఇసుక సత్యాగ్రహాలతో ప్రభుత్వం మీద విపక్షాలు దండయాత్ర చేస్తున్నాయి. ఇసుక కొరత విషయంలో.. ప్రభుత్వంపై.. విపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. అయితే.. తాజాగా.. ఇసుక కొరతపై.. టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 14న దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షకు అన్ని ప్రతిపక్ష పార్టీలతో పాటుగా.. […]

ఇసుక కోసం.. బీజేపీ మద్దతు కోరిన టీడీపీ..!
Follow us

| Edited By:

Updated on: Nov 12, 2019 | 11:49 AM

గత కొన్ని రోజులుగా.. ఏపీలో ఇసుక కొరతపై రచ్చ రచ్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. జనానికి అందని ఇసుక- రాజకీయ తుఫాన్‌గా మారింది. ఒకవైపు లాంగ్‌మార్చ్‌లు, ఇసుక సత్యాగ్రహాలతో ప్రభుత్వం మీద విపక్షాలు దండయాత్ర చేస్తున్నాయి. ఇసుక కొరత విషయంలో.. ప్రభుత్వంపై.. విపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. అయితే.. తాజాగా.. ఇసుక కొరతపై.. టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 14న దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షకు అన్ని ప్రతిపక్ష పార్టీలతో పాటుగా.. బీజేపీని మద్దతు కోరింది టీడీపీ.

కార్మికులకు అండగా నిలిచేందుకు చంద్రబాబు దీక్ష చేస్తున్నారని.. ఈ దీక్షకు తమ మద్దతు కావాలని.. కన్నాను కోరారు ఆలపాటి. గుంటూరులోని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి.. టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ స్వయంగా వెళ్లి.. మరీ  మద్దతు కోరారు. దీనికి.. కన్నా లక్ష్మీ నారాయణ కూడా సానుకూలంగా స్పందించారు. ప్రజా సమస్యలపై ఎవరు పోరాటం చేసినా.. వారికి.. తమ పార్టీ మద్దతు తప్పక ఉంటుందని కన్నా స్పష్టం చేశారు. ఏపీలో ఇసుక కొరత గురించి.. మొదటి నుంచీ బీజేపీ కూడా పోరాడుతూనే ఉంది.