అనంతపురం జిల్లా టీడీపీ నేత పల్లె రఘునాథరెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. భార్య ఉమాదేవి సమాధి వద్దకు నివాళులర్పించేందుకు వెళ్లిన ఆయన.. గుండెపోటుతో అక్కడే కూలిపోయినట్లు సమాచారం. దీంతో వెంటనే బంధువులు, అనుచరులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. కాగా అనంతపురం జిల్లా పుట్టపర్తి నుంచి టీడీపీ తరపున రఘునాథరెడ్డి ఎమ్మెల్యే బరిలో ఉన్న విషయం తెలిసిందే.