ఆస్పత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్

|

Aug 31, 2020 | 4:57 PM

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అనారోగ్యం నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారు. ఎన్ఆర్ఐ ఆస్పత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ అయ్యారు. రెండ్రోజుల క్రితమే ఈఎస్ఐ కేసులో అచ్చెన్నకు బెయిల్ మంజూరు అయ్యింది.

ఆస్పత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్
Follow us on

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అనారోగ్యం నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారు. ఎన్ఆర్ఐ ఆస్పత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ అయ్యారు. రెండ్రోజుల క్రితమే ఈఎస్ఐ కేసులో అచ్చెన్నకు బెయిల్ మంజూరు అయ్యింది. కరోనా పాజిటివ్ రావడంతో మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో అచ్చెన్న చికిత్సపొందుతున్నారు. పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నకు టీడీపీ నేతలు స్వాగతం పలికారు. ఆస్పత్రి నుంచి నేరుగా అచ్చెన్నాయుడు ఇంటికి చేరుకున్నారు.

ఈఎస్‌ఐ అక్రమాల కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడు అనారోగ్యం కారణాలతో ఆస్పత్రిలో చేరారు. జ్యుడీషియల్‌ కస్టడీ సమయంలోనూ అచ్చెన్నాయుడికి రెండు మార్లు శస్త్రచికిత్స జరగడంతోపాటు కోవిడ్‌ బారినపడ్డారు. దీంతో ఆయన ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చేరారు. కాగా, అచ్చెన్నాయుడ ఆరోగ్యపరిస్థితులను నేపథ్యంలో ఈఎస్‌ఐ కేసులోఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విజయవాడ ఏసీబీ కోర్టులో పూచీకత్తు సమర్పించి బెయిల్‌ పొందాలని ఆదేశించింది. అదే విధంగా కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రభావితం చేయరాదని అదేశించింది. అలాగే కేసు దర్యాప్తునకు అందుబాటులో ఉండాలని కోర్టు షరతులు విధించింది.