తమిళనాడులో కూలిన భవనం.. ముగ్గురు మృతి, ఆరుగురికి గాయాలు

| Edited By:

Jul 06, 2019 | 10:34 AM

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. మదురైలో మూడంతస్తుల భవనం ఒక్క సారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గరు మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నిర్మాణం పనులు జరుగుతుండగా బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో 15 మంది కూలీలు పనిచేస్తున్నట్లు గుర్తించారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. జేసీబీతో శిథిలాలను తొలగిస్తున్నారు. 40 మంది సిబ్బందిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి […]

తమిళనాడులో కూలిన భవనం.. ముగ్గురు మృతి, ఆరుగురికి గాయాలు
Follow us on

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. మదురైలో మూడంతస్తుల భవనం ఒక్క సారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గరు మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నిర్మాణం పనులు జరుగుతుండగా బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో 15 మంది కూలీలు పనిచేస్తున్నట్లు గుర్తించారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. జేసీబీతో శిథిలాలను తొలగిస్తున్నారు. 40 మంది సిబ్బందిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.