Unlock 4.0: పేరెంట్స్ అనుమతితో స్కూళ్లకు వెళ్లొచ్చు..

|

Aug 30, 2020 | 1:06 AM

అన్‌లాక్‌ 3.0 మరో రెండు రోజుల్లో ముగియనుండగా.. కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్‌ 4.0 గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 30 వరకు కంటైన్మెంట్ జోన్లలో పూర్తి స్థాయి లాక్ డౌన్ కొనసాగుతుందని..

Unlock 4.0: పేరెంట్స్ అనుమతితో స్కూళ్లకు వెళ్లొచ్చు..
Follow us on

Students may be permitted to visit Schools: అన్‌లాక్‌ 3.0 మరో రెండు రోజుల్లో ముగియనుండగా.. కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్‌ 4.0 గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 30 వరకు కంటైన్మెంట్ జోన్లలో పూర్తి స్థాయి లాక్ డౌన్ కొనసాగుతుందని.. కంటైన్మెంట్ జోన్ల వెలుపల మాత్రం మరిన్ని సడలింపులు ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందులో భాగంగానే నైపుణ్య శిక్షణ కేంద్రాలు, పారిశ్రామిక శిక్షణా కేంద్రాలు తెరుచేందుకు అనుమతించింది. అంతేకాకుండా కంటైన్మెంట్ జోన్ల వెలుపల 50 శాతం బోధనా సిబ్బంది స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు (ఆన్‌లైన్ క్లాసుల కోసం) అనుమతిచ్చింది.

అటు ఉన్నత విద్యా సంస్థల్లో పరిశోధనా కోర్సులు, సాంకేతిక, వృత్తి సంబంధ కోర్సులకు అనుమతిచ్చిన కేంద్రం.. 9 నుంచి 12వ తరగతి విద్యార్ధులు తల్లిదండ్రుల నుంచి వ్రాతపూర్వక అనుమతితోనే డౌట్స్ కోసం టీచర్లను కలుసుకోవచ్చంది. కాగా, సెప్టెంబర్ 30 వరకు స్కూల్స్, కాలేజీలు, విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లపై నిషేధం విధించింది. అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వాలు, తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించిన తర్వాతే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.