సరిహద్దులో పరిస్థితులు కాస్త ఉద్రిక్తంగానే ఉన్నాయి: ఆర్మీ చీఫ్
భారత్-చైనా వాస్తవాధీన వెంబడి ప్రస్తుత పరిస్థితి కొంత ఉద్రిక్తంగానే ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణె తెలిపారు. చైనాతో సరిహద్దు సమస్య తలెత్తిన నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణె లేహ్లో పర్యటిస్తున్నారు.

భారత్-చైనా వాస్తవాధీన వెంబడి ప్రస్తుత పరిస్థితి కొంత ఉద్రిక్తంగానే ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణె తెలిపారు. చైనాతో సరిహద్దు సమస్య తలెత్తిన నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణె లేహ్లో పర్యటిస్తున్నారు. రెండు రోజలు పర్యటనలో ఆయన పలు ప్రాంతాలను విజిట్ చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. లేహ్ చేరుకున్న తర్వాత పలు ప్రాంతాలను విజిట్ చేశానని, ఆఫీసర్లు, జేసీవోలతో మాట్లాడానని, దళాలు ఎంత వరకు సంసిద్ధంగా ఉన్నాయన్నారు. జవాన్లలో స్పూర్తి నింపేందుకు పర్యటించినట్లు చెప్పిన ఆయన ఎటువంటి సవాళ్లను అయినా ఎదుర్కొనేందుకు వారంతా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
#WATCH: Army Chief says to ANI, “They (the jawans) are highly motivated. Their morale is high and they are fully prepared to deal with any situation that may arise. Our officers and men are the finest in the world and will make not only the Army but also the nation proud.” pic.twitter.com/EFMZ3j77VO
— ANI (@ANI) September 4, 2020
ఎల్ఏసీ వెంబడి బలగాలను పెంచినట్లు చెప్పిన ఆయన.. పరిస్థితులకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకున్నామని, మన భద్రత, ఐక్యత సురక్షితంగా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు. గత రెండు మూడు నెలల నుంచి ఎల్ఏసీ వెంట పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నట్లు నరవాణె చెప్పారు. కానీ సైనిక, దౌత్యపరమైన స్థాయిలో చైనాతో నిరంతరం చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా చర్చలు నిర్వహిస్తూనే ఉంటామన్నారు. చర్చల ద్వారా సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం ఉన్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ తెలిపారు.
