శ్రేయస్‌ అయ్యర్ మెరుపులు.. ముంబై టార్గెట్ 157 పరుగులు

ఐపీఎల్‌-13వ సీజన్‌ బిగ్ ఫైట్... ఫైనల్ ఫైట్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ పోరాడే స్కోరు చేసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్ 65 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

శ్రేయస్‌ అయ్యర్ మెరుపులు.. ముంబై టార్గెట్ 157 పరుగులు
Follow us

|

Updated on: Nov 10, 2020 | 10:03 PM

ఐపీఎల్‌-13వ సీజన్‌ బిగ్ ఫైట్… ఫైనల్ ఫైట్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ పోరాడే స్కోరు చేసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్ 65 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రిషబ్‌ పంత్ 38 బంతుల్లో 56 పరుగులతో రాణించాడు. దీంతో ఢిల్లీ 20 ఓవర్లలో ఢిల్లీ 7 వికెట్లకు 156 పరుగులు చేసింది.

టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే  ఒకానొక దశలో 22/3తో పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును అయ్యర్‌,  పంత్ జోడీ ఆదుకుంది. వీరిద్దరూ స్ఫూర్తిదాయక ప్రదర్శనతో నాలుగో వికెట్‌కు 96 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఆరంభంలో టాప్‌ ఆర్డర్‌ను స్వల్ప స్కోరుకే పెవిలియన్‌ పంపిన ముంబై బౌలర్లు డెత్‌ ఓవర్లలోనూ కట్టుదిట్టంగా బంతులేస్తూ స్కోరు వేగానికి అడ్డుకట్ట వేశారు. స్పీడ్‌స్టర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ (3/30) ఢిల్లీని బాగా దెబ్బతీశాడు. ఆఖర్లో నాథన్‌ కౌల్టర్‌ నైల్‌(2/29), జయంత్‌ యాదవ్‌(1/25) బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు.