నేటి మధ్యాహ్నం షీలాదీక్షిత్ అంత్యక్రియలు

|

Jul 21, 2019 | 9:34 AM

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో గుండెపోటుతో మృతిచెందిన షీలా పార్థివదేహాన్ని నిజాముద్దీన్‌లోని ఆమె నివాసానికి తరలించారు. షీలా దీక్షిత్‌ భౌతిక కాయానికి ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత సోనియా గాంధీ సహ పలువురు  నేతలు నివాళులర్పించారు. నేడు మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తల సందర్శనార్థం పార్థివ దేహాన్ని ఉంచుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి అంతిమయాత్రగా బయల్దేరి […]

నేటి మధ్యాహ్నం షీలాదీక్షిత్ అంత్యక్రియలు
Follow us on

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో గుండెపోటుతో మృతిచెందిన షీలా పార్థివదేహాన్ని నిజాముద్దీన్‌లోని ఆమె నివాసానికి తరలించారు. షీలా దీక్షిత్‌ భౌతిక కాయానికి ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత సోనియా గాంధీ సహ పలువురు  నేతలు నివాళులర్పించారు. నేడు మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తల సందర్శనార్థం పార్థివ దేహాన్ని ఉంచుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి అంతిమయాత్రగా బయల్దేరి 2 గంటల తర్వాత నిగమ్‌ బోధ్‌ ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

షీలా చివరివరకూ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆమె మృతిపట్ల పార్టీలకతీతంగా సంతాపం వెల్లువెత్తింది. బాలీవుడ్ నటులు, వివిధ రంగాల ప్రముఖు లు సంతాపం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రభుత్వం రెండురోజుల సంతాప దినాలు ప్రకటించింది.