రాజన్నే గుర్తొస్తాడు: చేవెళ్ల చెల్లెమ్మ భావోద్వేగం

| Edited By:

Aug 15, 2019 | 2:54 PM

రాఖీ పండుగ అంటే తనకు రాజశేఖర్ రెడ్డినే గుర్తొస్తాడు అని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అన్ని పండుగల కంటే తనకు రాఖీ అంటేనే చాలా ఇష్టమని.. రాజన్న ఉన్నప్పుడు ప్రతి రాఖీ పండుగకు ఇంటికి వెళ్లి మొదట రాఖీ తానే కట్టేదాన్నని ఆమె చెప్పుకొచ్చారు. రాజన్నకు కట్టిన తరువాతే తన సొంత తమ్ముడి దగ్గరకు వెళ్లేదాన్నని ఆమె గుర్తు చేసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి తనను సొంత చెల్లెలుగా చూసుకునేవారని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. కాగా […]

రాజన్నే గుర్తొస్తాడు: చేవెళ్ల చెల్లెమ్మ భావోద్వేగం
Follow us on

రాఖీ పండుగ అంటే తనకు రాజశేఖర్ రెడ్డినే గుర్తొస్తాడు అని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అన్ని పండుగల కంటే తనకు రాఖీ అంటేనే చాలా ఇష్టమని.. రాజన్న ఉన్నప్పుడు ప్రతి రాఖీ పండుగకు ఇంటికి వెళ్లి మొదట రాఖీ తానే కట్టేదాన్నని ఆమె చెప్పుకొచ్చారు. రాజన్నకు కట్టిన తరువాతే తన సొంత తమ్ముడి దగ్గరకు వెళ్లేదాన్నని ఆమె గుర్తు చేసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి తనను సొంత చెల్లెలుగా చూసుకునేవారని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. కాగా రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో సబితా ఇంద్రారెడ్డిని చేవెళ్ల చెల్లెళ్లమ్మగా ఆయన సంబోధించేవారు. అంతేకాదు ఆయన మొదటి సారి ముఖ్యమంత్రి అయిన సమయంలో హోంశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి పనిచేసిన విషయం తెలిసిందే.