పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట..!

| Edited By:

Jul 04, 2019 | 1:37 PM

ముంబై మెట్రోపాలిటన్ కోర్టులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. పరువునష్టం కేసులో ముంబై కోర్టు ఎదుట హాజరైన రాహుల్ గాంధీ. గౌరీ లంకేశ్ హత్యకేసుతో బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కు సంబంధం ఉందని రాహుల్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పరువునష్టం దావా వేసిన సంగతి విదితమే. ఈ కేసులో రాహుల్ గాంధీకి 15వేల పూచీకత్తుతో మెట్రోపాలిటన్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. నాపై ఎలాంటి దురుద్ధేశ దాడి జరిగినా.. దానిని […]

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట..!
Follow us on

ముంబై మెట్రోపాలిటన్ కోర్టులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. పరువునష్టం కేసులో ముంబై కోర్టు ఎదుట హాజరైన రాహుల్ గాంధీ. గౌరీ లంకేశ్ హత్యకేసుతో బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కు సంబంధం ఉందని రాహుల్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పరువునష్టం దావా వేసిన సంగతి విదితమే.

ఈ కేసులో రాహుల్ గాంధీకి 15వేల పూచీకత్తుతో మెట్రోపాలిటన్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. నాపై ఎలాంటి దురుద్ధేశ దాడి జరిగినా.. దానిని నేను సమర్థవంతంగా ఎదుర్కొంటా అంటూ.. కోర్టు విచారణ అనంతరం ప్రకటించారు. నేను ప్రజల పక్షాన పోరాడుతున్నా.. ఇటువంటి కేసులు ఎన్ని దాఖలైతే నాకు అంత ఎక్కువగా పోరాడే శక్తి లభిస్తుందంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.