రవీంద్ర జడేజా బొటన వేలికి శస్త్రచికిత్స.. చివరి టెస్టు నుంచి ఔట్.. జడ్డు స్థానంలో ఎవరో..

|

Jan 13, 2021 | 10:32 PM

సిడ్నీ టెస్టు సందర్భంగా గాయపడిన రవీంద్ర జడేజాకు మంగళవారం శస్త్రచికిత్స జరిగింది. బోన్ ఫ్యాక్చర్ అవడంతో బొటన వేలిని...

రవీంద్ర జడేజా బొటన వేలికి శస్త్రచికిత్స.. చివరి టెస్టు నుంచి ఔట్.. జడ్డు స్థానంలో ఎవరో..
Follow us on

Ravindra Jadeja : సిడ్నీ టెస్టు సందర్భంగా గాయపడిన రవీంద్ర జడేజాకు మంగళవారం శస్త్రచికిత్స జరిగింది. బోన్ ఫ్యాక్చర్ అవడంతో బొటన వేలిని డాక్టర్లు సరిచేశారు. ఈ విషయాన్ని జడేజా తన సోషల్​మీడియాలో వెల్లడిస్తూ.. ఓ ఫొటోను షేర్​ చేశాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా బొటన వేలికి గాయమైన కారణంగా.. చివరి టెస్టు నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో జడేజాకు ఎడమచేతి బొటనవేలికి శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయాన్ని సోషల్​మీడియాలో వెల్లడించాడు.