కూక‌ట్‌ప‌ల్లిలో కారు బీభత్సవం.. యువకుడి మృతి

|

Sep 04, 2020 | 3:47 PM

హైద‌రాబాద్ మహాన‌గ‌రంలో కారు బీభత్సవం సృష్టించింది. కూక‌ట్‌ప‌ల్లిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వ‌ద్ద‌ అదుపుతప్పిన ఓ కారు వాహనాలపైకి దూసుకెళ్లింది. వేగంగా వ‌చ్చిన కారు ఓ ఆటోతో పాటు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో బైక్‌పై వెళ్తున్న యువ‌కుడు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు.

కూక‌ట్‌ప‌ల్లిలో కారు బీభత్సవం.. యువకుడి మృతి
Follow us on

హైద‌రాబాద్ మహాన‌గ‌రంలో కారు బీభత్సవం సృష్టించింది. కూక‌ట్‌ప‌ల్లిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వ‌ద్ద‌ అదుపుతప్పిన ఓ కారు వాహనాలపైకి దూసుకెళ్లింది. వేగంగా వ‌చ్చిన కారు ఓ ఆటోతో పాటు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో బైక్‌పై వెళ్తున్న యువ‌కుడు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు యువ‌కుడి మృత‌దేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన కారు డ్రైవ‌ర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘటనలో ఆటో ధ్వంసం కాగా, అందులో ప్రయాణిస్తున్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారని పోలీసులు తెలిపారు.