రాజస్థాన్ బీజేపీ చీఫ్ సతీష్ పుణియాకు కరోనా
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో రూపంలో వైరస్ అంటుకుని మంచానికి పరిమితం చేస్తోంది. అటు కరోనా బారినపడుతున్న రాజకీయ నాయకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా రాజస్థాన్ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ పుణియాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
దేశంలో కరోనా విజృంభణ కంటిన్యూ అవుతూనే ఉంది. వీళ్లు, వాళ్లు అనే భేదం లేకుండా అన్ని వర్గాలను అవస్థలు పెట్టిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో రూపంలో వైరస్ అంటుకుని మంచానికి పరిమితం చేస్తోంది. అటు కరోనా బారినపడుతున్న రాజకీయ నాయకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా రాజస్థాన్ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ పుణియాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తాను కరోనా పరీక్షలు చేయించుకున్నానని, ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ పాజిటివ్ వచ్చిందని ఆయన ట్వీట్ చేశారు. కాగా, వైద్యుల సూచనల మేరకు తాను హోం ఐసోలేషన్లో ఉన్నానని చెప్పారు. ఈమధ్య కాలంలో తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. తనకు మద్దతుగా నిలిచిన వారందరికి ధన్యవాదాలు అని వెల్లడించారు. కరోనాతో భయపడాల్సి అవసరం లేదన్న ఆయన హోం క్వారంటైన్ లో ఉంటూ వైద్యుల సలహాలు తీసుకుంటే సరిపోతుందన్నారు.
कल प्रवास से आने के बाद #Covid_19 की जांच करवाई यद्यपि मुझे लक्षण नहीं थे लेकिन मेरी रिपोर्ट +Ve आयी है और डाक्टरी सलाह पर मैंने स्वयं को घर पर ही ISOLATE किया है, विगत दिनों मेरे से संपर्क में आए सभी व्यक्ति अपना परीक्षण करवा लें,सहयोग के लिए धन्यवाद।@BJP4Rajasthan @BJP4India
— Satish Poonia (@DrSatishPoonia) September 4, 2020