రాజ‌స్థాన్ బీజేపీ చీఫ్ స‌తీష్ పుణియాకు క‌రోనా

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో రూపంలో వైరస్ అంటుకుని మంచానికి పరిమితం చేస్తోంది. అటు క‌రోనా బారిన‌ప‌డుతున్న రాజ‌కీయ నాయ‌కుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా రాజ‌స్థాన్ బీజేపీ రాష్ట్ర శాఖ‌ అధ్య‌క్షుడు స‌తీష్ పుణియాకు క‌రోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

రాజ‌స్థాన్ బీజేపీ చీఫ్ స‌తీష్ పుణియాకు క‌రోనా
Follow us

|

Updated on: Sep 04, 2020 | 10:21 AM

దేశంలో కరోనా విజృంభణ కంటిన్యూ అవుతూనే ఉంది. వీళ్లు, వాళ్లు అనే భేదం లేకుండా అన్ని వర్గాలను అవస్థలు పెట్టిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో రూపంలో వైరస్ అంటుకుని మంచానికి పరిమితం చేస్తోంది. అటు క‌రోనా బారిన‌ప‌డుతున్న రాజ‌కీయ నాయ‌కుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా రాజ‌స్థాన్ బీజేపీ రాష్ట్ర శాఖ‌ అధ్య‌క్షుడు స‌తీష్ పుణియాకు క‌రోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తాను క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నాన‌ని, ఎలాంటి ల‌క్ష‌ణాలు లేన‌ప్ప‌టికీ పాజిటివ్ వ‌చ్చింద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. కాగా, వైద్యుల సూచ‌న‌ల మేరకు తాను హోం ఐసోలేష‌న్‌లో ఉన్నాన‌ని చెప్పారు. ఈమ‌ధ్య కాలంలో త‌న‌ను క‌లిసిన‌వారు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఆయ‌న‌ సూచించారు. త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన‌ వారంద‌రికి ధ‌న్య‌వాదాలు అని వెల్ల‌డించారు. కరోనాతో భయపడాల్సి అవసరం లేదన్న ఆయన హోం క్వారంటైన్ లో ఉంటూ వైద్యుల సలహాలు తీసుకుంటే సరిపోతుందన్నారు.