కరోనా వైరస్ బారినపడి కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్ అంగడీ ప్రాణాలు విడిచారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో బుధవారం ఆయన తుది శ్వాస విడిచారు. కర్ణాటకలోని బెళగావికి చెందిన సురేష్ అంగడీ.. 2004, 2009, 2014, 2019లో వరుసగా బెళగావి నుంచి లోక్సభ ఎంపీగా గెలిచారు. ఈ నెల 11న ఆయనకు కరోనా సోకగా.. కోలుకుంటున్నారని అంతా అనుకున్నారు. ఇక అంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. కాగా, దేశంలో కరోనాతో చనిపోయిన తొలి కేంద్రమంత్రి సురేష్ అంగడీ కాగా.. ఇప్పటివరకు కరోనా వల్ల దేశంలో ముగ్గురు ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి మరణించారు. (Railways MoS Suresh Angadi)
Also Read:
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కూల్కు వెళ్లకుండానే పది పరీక్షలు.?
శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..
ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు..