తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో బయపటడిన 9 మృతదేహాలకు పోస్టుమార్టం కంప్లీట్ అయ్యింది. ఈ కేసు తీరుతెన్నులపై సర్వత్రా ఉత్కంఠ నెలకున్న నేపథ్యంలో.. పోస్టుమార్టం రిపోర్టులో ఏముందో అని తెలుసుకోవడం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా వాళ్లంతా ప్రాణాలతో ఉండగానే బావిలో పడినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలినట్టు సమాచారం. ఇక వాళ్లంతట వాళ్లే కావాలని బావిలోకి దూకారా? లేదంటే మత్తు, విషంలాంటిది ఇచ్చి బతికి ఉండగానే బావిలో పడేశారా అన్న విషయాలు తేలాల్సి ఉంది.
పోస్టుమార్టానికి సంబంధించి టీవీ9తో ఎంజీఎం మార్చురీ ఫోరెన్సిక్ విభాగం హెడ్ డాక్టర్ రజామాలిక్ చెప్పిన వివరాలు..
ఈ కేసులో ముఖ్యంగా ఫోన్ కాల్స్ డిటేల్స్ కీలకంగా భావిస్తున్నారు పోలీసులు. మక్సూద్ తనయ బుస్రాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తోన్న యాకూబ్ ఫోన్ కాల్స్తోపాటు.. ఇతరులతో మక్సూద్ ఏం మాట్లాడనే విషయాలపై పోలీసలు ఫోకస్ పెట్టారు. మృతుల్లో ఏడుగురి సెల్ ఫోన్లు కనిపించకపోవడంతో.. వాటి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే అదుపులో ఉన్న అనుమానితుడు యాకూబ్ను పోలీసులు విచారిస్తున్నారు. అతడితోపాటు బిహర్కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్ను కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.