తలైవా… నీకు మాత్రమే మా ఓటు !

|

Nov 11, 2020 | 8:16 PM

వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోగా పార్టీని ప్రారంభించాలంటూ తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌పై రోజురోజుకూ తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. గత రెండు నెలలుగా రజనీ అభిమాన సంఘాల పేరుతో పోస్టర్లు వెలుతస్తున్నాయి.

తలైవా... నీకు మాత్రమే మా ఓటు !
Follow us on

Fans put up Posters : వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోగా పార్టీని ప్రారంభించాలంటూ తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌పై రోజురోజుకూ తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. గత రెండు నెలలుగా రజనీ అభిమాన సంఘాల పేరుతో పోస్టర్లు వెలుతస్తున్నాయి. రజనీ రాజకీయాల్లో రావాలంటూ ఒత్తిడి పెంచుతున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా దర్శనిస్తున్న పోస్టర్లు తీవ్ర సంచలనం కలిగిస్తున్నారు.

రాజకీయాల్లోకి తలైవా రావాలి..!అంటూ అభిమన సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లను అంటించారు. రజనీకాంత్ పార్టీ పెడితేనే ఓట్లు వేస్తామని..లేకుంటే ఓటు హక్కు కూడా వినియోగించుకొమని పోస్టర్లలో ముద్రించారు. అంతే కాదు.. పార్టీ స్థాపించకుండా ఇతర పార్టీలకు రజనీ మద్దతు ఇవ్వకూడదు అంటూ అందులో షరతులు కూడా పెడుతున్నారు అభిమానులు. మద్దతు ఇచ్చే ఆపార్టీకి ఓటు వేయమంటే అస్సలు వేయమని అభిమాన సంఘాలు మంక్కు పట్టు పడుతున్నాయి.

వాటితోపాటు… రజనీ రాజకీయాల్లో రావాలని, అవినీతి రహిత పాలన అందించాలనే నినాదాలతో పోస్టర్లు ముద్రించి వాడవాడలా గోడలపై అతికిస్తున్నారు. రాష్ట్రంలో అధికారం మార్పు కోసం, రాజకీయ మార్పు కోసం తలైవా తప్పకుండా రాజకీయాల్లోకి రావాలి అంటూ ఆ పోస్టర్లలో నినాదాలు ముద్రించి వున్నారు. ఈ పోస్టర్లు సోషల్‌ మీడియాలో వెలువడి సంచలనం సృష్టిస్తున్నాయి.