వాజ్‌పేయ్ రికార్డును సమం చేసిన మోదీ

| Edited By:

Aug 15, 2019 | 7:59 AM

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయ్ రికార్డును ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమం చేశారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించిన తర్వాత ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించడం ఇదే మొదటిసారి. నేటి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంతో కలిపితే ఆరు ప్రసంగాలు పూర్తైనట్లు లెక్క. మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పాయ్ కూడా 1998 నుంచి 2003 వరకు ఆరుసార్లు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించారు. అయితే ఈసారి మోదీ ప్రసంగానికి మరో […]

వాజ్‌పేయ్ రికార్డును సమం చేసిన మోదీ
Follow us on

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయ్ రికార్డును ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమం చేశారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించిన తర్వాత ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించడం ఇదే మొదటిసారి. నేటి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంతో కలిపితే ఆరు ప్రసంగాలు పూర్తైనట్లు లెక్క. మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పాయ్ కూడా 1998 నుంచి 2003 వరకు ఆరుసార్లు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించారు. అయితే ఈసారి మోదీ ప్రసంగానికి మరో ప్రాముఖ్యత కూడా ఉంది. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన లాంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న కొన్ని రోజులకే పంద్రాగస్టు రావడంతో జాతి దృష్టిని మరింత ఆకర్షించిందని వివిధ రంగాల నిపుణులు చెబుతున్నారు.