వర్షాలొస్తే ఖరీఫ్ పంట వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు రైతులు. అయితే, ఈ ఏడాది వానలు ఓ నాలుగు రోజులు ఆలస్యంగా కురవనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కేరళను రుతుపవనాల ఎప్పుడైతే తాకుతాయో …అప్పుడు దేశంలో నాలుగు నెలల వర్షాకాలం ప్రారంభానికి సంకేతంగా భావిస్తారు. అయితే ఈసారి కేరళను రుతుపవనాలు జూన్ 5న పలకరించనున్నట్లు పేర్కొంది వాతావరణ శాఖ.
“ఈసారి కేరళను నైరుతి రుతుపవనాలు ప్రతి ఏడాది కంటే కాస్త ఆలస్యంగా తాకనున్నాయి. కేరళలో జూన్ 5కు కాస్త అటూఇటుగా వర్షాలు ప్రారంభం కానున్నాయి” అని భారత వాతావరణ శాఖ తెలిపింది.