ముర్బాద్ జలపాతంలో ఇద్దరు గల్లంతు.. ఒకరు మృతి

|

Aug 14, 2020 | 3:00 PM

మహారాష్ట్రలో విహార యాత్ర కాస్త విషాదంగా మారింది. థానే జిల్లాలోని ముర్బాద్ తాలూకాలోని జలపాతంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.

ముర్బాద్ జలపాతంలో ఇద్దరు గల్లంతు.. ఒకరు మృతి
Follow us on

మహారాష్ట్రలో విహార యాత్ర కాస్త విషాదంగా మారింది. థానే జిల్లాలోని ముర్బాద్ తాలూకాలోని జలపాతంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఓ వ్యక్తి మృతదేహం లభ్యం కాగా, మరొకరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. అంబోలి గ్రామానికి చెందిన 12 మంది యువకులు గురువారం మధ్యాహ్నం ఖోపివిలిలోని జలపాతంలో ఈత కొట్టడానికి వెళ్లారు. అందులో ఉమేశ్‌ టుబ్కడ్లే(25), కార్తీక్‌ గాడ్జ్‌ (25)అనే ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు జలపాతంలో పడిపోయారు. గల్లంతైనవారి కోసం వారి స్నేహితులు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీం గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టగా ఉమేశ్‌ మృతదేహం లభించింది. కార్తీక్‌ కోసం వెతుకుతున్నట్లు ముర్బాద్ పోలీస్ స్టేషన్ హౌస్ అధికారి శుక్రవారం తెలిపారు. దీంతో థానే, పాల్ఘర్ జిల్లాల కలెక్టర్లు వానకాలంలో ఇలాంటి ప్రమాదాలను నివారణకు చర్యలు చేపట్టారు. జల ప్రవాహం కలిగిన ప్రాంతాల వద్ద ఎవరినీ అనుమతించవద్దని ఉత్తర్వులు జారీ చేశారు.