కేన్సర్ బాధితులకు రెడ్డి లాబ్స్ గుడ్ న్యూస్..

|

Aug 26, 2020 | 3:58 PM

కేన్సర్‌ బాధితులకు రెడ్డి లాబ్స్ సంస్థ ఓ శుభవార్త తీసుకువచ్చింది. పోషక విలువలతో కూడిన ఓ డ్రింక్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కేన్సర్‌, ఇతర తీవ్రమైన జబ్బులతో బాధపడే వారికి చికిత్స తీసుకునే సమయంలో శరీరంలో పోషకాల కొరత ఏర్పడుతుంది. దీనికి పరిష్కారంగా ‘సెలివీదా మ్యాక్స్‌’ అనే పేరుతో పోషకాలను అందించే పానీయాన్ని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది.

కేన్సర్ బాధితులకు రెడ్డి లాబ్స్ గుడ్ న్యూస్..
Follow us on

కేన్సర్‌ బాధితులకు రెడ్డి లాబ్స్ సంస్థ ఓ శుభవార్త తీసుకువచ్చింది. పోషక విలువలతో కూడిన ఓ డ్రింక్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కేన్సర్‌, ఇతర తీవ్రమైన జబ్బులతో బాధపడే వారికి చికిత్స తీసుకునే సమయంలో శరీరంలో పోషకాల కొరత ఏర్పడుతుంది. దీనికి పరిష్కారంగా ‘సెలివీదా మ్యాక్స్‌’ అనే పేరుతో పోషకాలను అందించే పానీయాన్ని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. తద్వారా ‘హాస్పిటల్‌ న్యూట్రిషన్‌ విభాగం’ లోకి తాము అడుగుపెట్టినట్లు అయిందని ఓ ప్రటనలో వివరించింది. కేన్సర్‌, క్రిటికల్‌ కేర్‌, సీఓపీడీ (క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌) బాధితులకు పోషకాహార అవసరాలు తీర్చటానికి ‘సెలివిదా మ్యాక్స్‌’ దోహదపడుతుందని పేర్కొంది. ఇందులో ప్రొటీన్లు, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండటం వల్ల వ్యాధి- చికిత్సకు సంబంధించిన ఇబ్బందుల నుంచి రోగులు కోలుకోవచ్ఛు ఇన్‌ఫ్లమేషన్‌, అస్టాజాంటిన్‌… వంటి లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుందని వివరించింది. త్వరలో పూర్తిస్థాయిలో మార్కెట్ లో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రెడ్డీ ల్యాబ్స్ వెల్లడించింది.