మాస్కు ధరించకుంటే.. కరోనా ఆస్పత్రిలో సేవ చేయాల్సిందే..!

| Edited By:

Jul 06, 2020 | 9:57 PM

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి కట్టడి కోసం గ్వాలియర్ నగర అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు భౌతిక దూరం నిబంధనలు పాటించేలా

మాస్కు ధరించకుంటే.. కరోనా ఆస్పత్రిలో సేవ చేయాల్సిందే..!
Follow us on

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి కట్టడి కోసం గ్వాలియర్ నగర అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు భౌతిక దూరం నిబంధనలు పాటించేలా చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని పౌరులు స్థానిక కరోనా ఆస్పత్రిలోనూ, పోలీస్ చెక్ పోస్టుల వద్ద మూడు రోజుల పాటు వాలంటీర్లుగా సేవ చేయాలని అక్కడి అధికారులు ప్రకటించారు.

కోవిద్-19 ప్రోటోకాల్‌ను ఉల్లంఘించేవారిపై జరిమానాలు కూడా విధిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా ఆటకట్టించేందుకు ప్రభుత్వం చేపట్టిన కిల్ కరోనా కార్యక్రమంలో  భాగంగానే గ్వాలియర్ నగర అధికారులు తాజా ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు.. రాష్ట్రంలోని కరోనా రోగులందరినీ గుర్తించేందుకు ఇంటింటి సర్వే కూడా చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఆదివారం నాడు ఆ నగరంలో కొత్తగా 51 కరోనా కేసులు వెలుగు చూడటంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 528కి చేరుకుంది.

Also Read: ర్ణాటకలో అడవుల్లో ‘బగీరా’.. వైరల్ అవుతున్న ఫోటోలు..