నాగబాబు మరో సంచలన ట్వీట్..

|

May 23, 2020 | 12:56 PM

నాగబాబు సోషల్ మీడియా వేదికగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గాడ్సే గురించి వివాదాస్పద పోస్టులు చేసిన జనసేన నేత నాగబాబు తాజాగా మరో సారి తన పోస్టులకు పదును పెట్టారు.

నాగబాబు మరో సంచలన ట్వీట్..
Follow us on

నాగబాబు సోషల్ మీడియా వేదికగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గాడ్సే గురించి వివాదాస్పద పోస్టులు చేసిన జనసేన నేత నాగబాబు తాజాగా మరో సారి తన పోస్టులకు పదును పెట్టారు. ఇండియన్ కరెన్సీ నోట్లపై మహాత్మగాంధీతోపాటు మరికొందరు మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉందని పేర్కొన్నారు.

‘‘ఇండియన్ కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్,అంబేద్కర్, భగత్ సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్,లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు,అబ్దుల్ కలాం, సావర్కర్,వాజపేయి  లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది. ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనం  మర్చిపోకూడదని ఒక ఆశ. గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు.దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు.భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది’’ అని తెలుగులో ఓ ట్వీట్ చేసారు. అయితే నాగబాబు చేసిన పోస్ట్‌పై మిశ్రమ స్పందన లభించింది.