కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!

దేశ ఆర్థిక రాజధాని ముంబైని హైదరాబాద్‌తో అనుసంధానిస్తూ బుల్లెట్‌ రైలు పరుగులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో దేశవ్యాప్తంగా ఏడు కొత్త బుల్లెట్‌ రైళ్లను...

కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!

Updated on: Sep 15, 2020 | 12:17 PM

Hyderabad Bullet Train: దేశ ఆర్థిక రాజధాని ముంబైని హైదరాబాద్‌తో అనుసంధానిస్తూ బుల్లెట్‌ రైలు పరుగులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో దేశవ్యాప్తంగా ఏడు కొత్త బుల్లెట్‌ రైళ్లను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇందులో ముంబై-హైదరాబాద్‌ కూడా ఉంది. వీటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లను సిద్ధం చేయాలని జాతీయ హైస్పీడ్‌ రైలు కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌)ను కేంద్రం ఆదేశించింది. ఈ ఏడు రైళ్లకు మొత్తం అంచనా వ్యయం దాదాపు రూ.10 లక్షల కోట్లు ఉంటుందని ఓ అధికారి వెల్లడించారు.

దేశంలోనే తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును ముంబై-అహ్మదాబాద్‌ మధ్య (508.17 కిలోమీటర్లు) కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. దాని అంచనా వ్యయం రూ.1.08 లక్షల కోట్లు. వాస్తవానికి ఆ మార్గంలో 2023 డిసెంబర్‌లోనే బుల్లెట్‌ రైలు సేవలను ప్రారంభించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే- భూసేకరణ సంబంధిత సమస్యలు, కోవిడ్‌ మహమ్మారి విజృంభణ వంటి ఆటంకాల కారణంగా ఆ ప్రారంభ తేదీని 2028 అక్టోబర్‌కు వాయిదా వేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముంబై-అహ్మదాబాద్‌ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు 63 శాతం భూసేకరణ పూర్తయినట్లు తెలుస్తోంది.

Also Read:

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్

‘కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో తయారు చేశారు.. ఆధారాలు ఉన్నాయి’

పేద విద్యార్థుల పాలిట దేవుడిగా మారిన సోనూసూద్…

Loading...
Unable to load recommendations.
Follow Us