హైవే కంటైనర్ సెల్‌ఫోన్ల దోపిడీ ముఠా అరెస్ట్..

|

Sep 29, 2020 | 8:37 PM

సినీ పక్కీలో నడుస్తున్న ట్రక్కు నుంచి చోరీలకు పాల్పడుతున్న ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది.

హైవే కంటైనర్ సెల్‌ఫోన్ల దోపిడీ ముఠా అరెస్ట్..
Follow us on

సినీ పక్కీలో నడుస్తున్న ట్రక్కు నుంచి చోరీలకు పాల్పడుతున్న ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. చిత్తూరు జిల్లా నగరి వద్ద కంటైనర్‌లో మొబైల్‌ ఫోన్లు దోపిడీ చేసిన దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌ జిల్లాలో దొంగల ముఠాలోని ముగ్గురు సభ్యులను పట్టుకున్నారు. నిందితులు పేరుమోసిన అంతర్రాష్ట్ర దోపిడీ గ్యాంగ్ కంజరభట్‌ బందిపోటు ముఠాగా పోలీసులు గుర్తించారు.

గత నెలలో కంటైనర్‌ నుంచి రూ.7కోట్ల విలువైన మొబైల్‌ఫోన్లను దొంగలు చాకచక్యంగా దోచుకెళ్లారు. ట్రక్కు నడుస్తుండగానే వెనుకనుంచి చోరీ సెల్‌ఫోన్లను దోచుకెళ్లారు. ఇదే క్రమంలో కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. దొంగల ముఠా మధ్యప్రదేశ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి పోలీసుల సాయంతో వారిని అరెస్ట్‌ చేశారు. దోపిడీ చేసిన మొబైల్‌ ఫోన్లను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌ పర్యవేక్షణలో నెలకుపైగా కష్టపడి దొంగలను పట్టుకున్నారు.